ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జీనియస్ కన్సల్టెంట్, డీమార్ట్ కంపెనీల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే మేళాలో నిరుద్యోగులు పాల్గొనవచ్చు.
ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ:
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
కంపెనీల వివరాలు:
జీనియస్ కన్సల్టెంట్, డీమార్ట్ కంపెనీల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు:
ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:
30-10-2024 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము:
ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
తిరువూరు,
ఎన్టీఆర్ జిల్లా.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి