తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాల విడుదల, పోస్టుల భర్తీ ప్రక్రియలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబరు నెలలో జరగగా.. గ్రూప్-3 పరీక్షలు నవంబరు నెలలో జరిగాయి. గ్రూప్-2 పరీక్షలు ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. అయితే ఫలితాల విడుదల.. పోస్టుల భర్తీ ప్రక్రియను మాత్రం అవరోహణక్ర మంలో చేపట్టాలని కమిషన్ భావిస్తోంది. తొలుత గ్రూప్-1 ఫలితాలు విడుదల చేసి, పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాక.. గ్రూప్-2 ఫలితాలు విడుదల చేసి, పోస్టుల భర్తీ చేపట్టాలని.. ఆ తర్వాతే గ్రూప్-3 ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది. ఉన్నత కేటగిరీ పోస్టుల తరువాత కింది కేటగిరీ పోస్టుల భర్తీ చేపట్టడం ద్వారా బ్యాక్ లాగ్ నివారించవచ్చని కమిషన్ అభిప్రాయం.
ఫిబ్రవరి నెలలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు, మార్చి నెలలో గ్రూప్-2 ఫలితాలను విడుదల చేసి నియామక ప్రక్రియ ముగించాలని టీజీపీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఏప్రిల్ నెలలోపు గ్రూప్-3 ఫలితాలను కూడా విడుదల చేసి నియామక ప్రక్రియ ముగించాలని భావిస్తోంది. మొత్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి నాటికి గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల నియామకాలన్నీ పూర్తి చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యోచిస్తున్నట్లు సమాచారం.
✅తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, TG SI/Constable, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.